ETV Bharat / bharat

కాల్పుల విరమణకు పాక్ తూట్లు- 3 వేల సార్లు ఉల్లంఘన

author img

By

Published : Sep 15, 2020, 5:37 AM IST

గడిచిన ఎనిమిది నెలల వ్యవధిలో పాకిస్థాన్ 3,186 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని కేంద్రం వెల్లడించింది. 242 సార్లు సీమాంతర కాల్పులకు తెగబడిందని తెలిపింది. ఈ కాల్పుల్లో ఏడుగురు ఆర్మీ సిబ్బంది మరణించగా.. ఇద్దరు గాయపడినట్లు పేర్కొంది. రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించింది.

Pak resorted to 3,186 ceasefire violations along LoC in Jammu region in last 8 months: Govt
కాల్పుల విరమణకు పాక్ తూట్లు- 3 వేల సార్లు ఉల్లంఘన

ఓవైపు కరోనా మహమ్మారి ప్రబలుతున్నప్పటికీ.. పాకిస్థాన్ మాత్రం తన ప్రవృత్తి మార్చుకోవడం లేదు. నియంత్రణ రేఖ వెంబడి పదేపదే కాల్పులకు తెగబడుతూ.. ఉగ్రవాదులను భారత్​లోకి ఎగదోసేందుకు ప్రయత్నిస్తోంది. గడిచిన 8 నెలల్లో(జనవరి- సెప్టెంబర్ 7 వరకు) జమ్మూలో పాక్ సైన్యం ఏకంగా 3,186 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు కేంద్రం వెల్లడించింది. వీటికి తోడు జనవరి 1 నుంచి ఆగస్టు 31 మధ్య అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 242 సార్లు సీమాంతర(క్రాస్ బార్డర్) కాల్పులు జరిగినట్లు రాజ్యసభకు తెలిపింది.

ఈ సంవత్సరం సెప్టెంబర్ 7 వరకు ఎనిమిది మంది సైనిక సిబ్బంది ఈ కాల్పుల్లో మరణించినట్లు రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ తెలిపారు. మరో ఇద్దరు గాయపడ్డట్లు పేర్కొన్నారు. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించారు.

దీటుగా బదులు

పాక్ కాల్పులకు భారత సైన్యం ఎప్పటికప్పుడు దీటుగా బదులిచ్చిందని మంత్రి తెలిపారు. కాల్పుల ఉల్లంఘన చోటు చేసుకున్న ప్రతీసారి ఈ విషయంపై సంబంధిత పాక్ అధికారులతో చర్చించినట్లు చెప్పారు.

గతేడాది ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాతి నుంచి కశ్మీర్​లో అలజడులు సృష్టించేందుకు పాక్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. ఉగ్రవాదులను దేశంలోకి పంపేందుకే పాక్ కాల్పులకు తెగబడుతోందని అన్నారు.

ఓవైపు కరోనా మహమ్మారి ప్రబలుతున్నప్పటికీ.. పాకిస్థాన్ మాత్రం తన ప్రవృత్తి మార్చుకోవడం లేదు. నియంత్రణ రేఖ వెంబడి పదేపదే కాల్పులకు తెగబడుతూ.. ఉగ్రవాదులను భారత్​లోకి ఎగదోసేందుకు ప్రయత్నిస్తోంది. గడిచిన 8 నెలల్లో(జనవరి- సెప్టెంబర్ 7 వరకు) జమ్మూలో పాక్ సైన్యం ఏకంగా 3,186 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు కేంద్రం వెల్లడించింది. వీటికి తోడు జనవరి 1 నుంచి ఆగస్టు 31 మధ్య అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 242 సార్లు సీమాంతర(క్రాస్ బార్డర్) కాల్పులు జరిగినట్లు రాజ్యసభకు తెలిపింది.

ఈ సంవత్సరం సెప్టెంబర్ 7 వరకు ఎనిమిది మంది సైనిక సిబ్బంది ఈ కాల్పుల్లో మరణించినట్లు రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ తెలిపారు. మరో ఇద్దరు గాయపడ్డట్లు పేర్కొన్నారు. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించారు.

దీటుగా బదులు

పాక్ కాల్పులకు భారత సైన్యం ఎప్పటికప్పుడు దీటుగా బదులిచ్చిందని మంత్రి తెలిపారు. కాల్పుల ఉల్లంఘన చోటు చేసుకున్న ప్రతీసారి ఈ విషయంపై సంబంధిత పాక్ అధికారులతో చర్చించినట్లు చెప్పారు.

గతేడాది ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాతి నుంచి కశ్మీర్​లో అలజడులు సృష్టించేందుకు పాక్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. ఉగ్రవాదులను దేశంలోకి పంపేందుకే పాక్ కాల్పులకు తెగబడుతోందని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.